Sunday, May 5, 2024

విజయవంతంగా విశాఖ గర్జన…

వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన విజయవంతంగా కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన విశాఖ గర్జన ర్యాలీ వర్షాల కారణంగా దాదాపు గంటన్నర సేపు ఆలస్యంగా మొదలైంది. అయినా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో ర్యాలీ సందడిగా మారింది. అధికార వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా భారీగా హాజరయ్యారు. నగరంలో ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ర్యాలీ సాగే అంబేద్కర్ విగ్రహం-వైఎస్సార్ విగ్రహం రూట్ లో ఇతర వాహనాల్ని అనుమతించడం లేదు.

విశాఖలో వైసీపీ గర్జన నేపథ్యంలో ర్యాలీ పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డప్పు కళాకారులు, నృత్యాలతో ర్యాలీ సందడిగా సాగుతోంది. విశాఖ గర్జన కోసం వైసీపీ భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టింది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి మంత్రుల్ని, నేతల్ని, కార్యకర్తల్ని భారీగా తరలించింది. దీంతో వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement