Saturday, May 18, 2024

యువ క్రికెటర్లకు ఏపీఎల్ మంచి వేదిక.. ఏసీఏ పనితీరు అద్భుతం: కృష్ణమాచారి శ్రీకాంత్

విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఆంధ్ర క్రికెట్ పని తీరు అద్భుతం అని ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లను ప్రపంచ కప్ హీరో, ఇండియా టెస్ట్ కెప్టెన్, మాజీ బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. ఆదివారం డా. వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, అంతర్జాతీయ ప్లేయర్ కె. ఎఎస్. భరత్ తో కలిసి ఆయన మాట్లాడారు.

ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి ప్రోత్సాహం కోసం ఏపీఎల్ ఉపయోగ పడుతుందని అన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర నుంచి మరింత మందిని దేశానికి ప్రాతనిధ్యం వహించే క్రికెటర్లను తయారు చేయాలని ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్ చంద్రా రెడ్డి, ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లకు కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. ఆంధ్రలో యువ క్రికెటర్ల ప్రతిభకు కొదవ లేదని ఆన్నారు.

యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించేందుకు ఏపీఎల్ మంచి వేదిక అని అన్నారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో ఆడేందుకు ఏంతో మందిని తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. క్రీడాకారుల్లో నైపణ్యాభివృద్ధి కోసం వైజాగ్ స్టేడియాన్ని ఏంతో అభివృద్ధి చేశారని అభినం దించారు. ప్లైట్ లో వచ్చేటప్పుడు కొందరు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించు కావాలని సూచించడంతో అక్కడకు వెళ్లేందుకు తన ప్రోగ్రాంలో లేకపోయినా వెళ్లి స్వామిని దర్శించుకున్నాని వెల్లడించారు.

- Advertisement -

ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన ఏపీఎల్ -1 కు బాగా ఆదరణ పెరిగిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీఎల్ -2 కు మరింత ఆదరణ వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావ్ పేరుతో విశాఖ స్టేడియంలో ఓ స్టాండ్ ను కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement