Saturday, May 18, 2024

నీతి ఆయోగ్‌ సీఈఓకు స్టీల్ ప్లాంట్ నిరసన సెగ

వైజాగ్ స్టీల్ ప్లాండ్ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్‌లో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: బిడ్డకు పాలు ఇస్తే కాంట్రవర్శీ చేస్తారా: గాడోట్‌ సీరియస్

Advertisement

తాజా వార్తలు

Advertisement