Wednesday, May 1, 2024

వీరా సాయేశ్ మృతి బాధాకరం : టీడీపీ నేత‌ బడేటి చంటి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : అమెరికాలోని ఒహయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ మృతి చెందడం బాధాకరమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. వీరా సాయేశ్ మృతి చెందిన సంఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే బడేటి చంటి ఏలూరు అశోక్ నగర్ లోని అతడి ఇంటికి వెళ్లి వీరా సాయేశ్ మాతృమూర్తి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారుని మృతితో తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరు మున్నీరు అవుతున్న వీరా సాయేశ్ త‌ల్లిని ఓదార్చారు. ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన వీరా సాయేశ్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడని, అన్యం పుణ్యం తెలియని అతనిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేయడం దారుణమని బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు ఈతకోట శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement