Friday, May 3, 2024

ఈత‌కు వెళ్లిన వేద‌పాశాల స్టూడెంట్స్.. కృష్ణా న‌దిలో ఆరుగురి గ‌ల్లంతు..

అమరావతి : కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతైన ఘ‌ట‌న ఈ రోజు జ‌రిగింది. నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు క‌నిపించ‌కుండా పోయారు. గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీయగా.. మరో ఒకరి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన విద్యార్థులు స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement