Thursday, May 2, 2024

ప్రేమోన్మాదుల పట్ల జాగ్రత్త.. రక్షణ వ్యవస్థను గుర్తు చేసుకోవాలన్న వాసిరెడ్డి పద్మ

గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది బాధితురాలు శ్రావణి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. లోతైన పోలీసు విచారణతో నేరస్తులపై కఠిన చర్యలు చేపడతామని బాధితురాలి కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి పేరిట ఆడపిల్లలను వేధించే నీచమైన సంస్కృతిని ఖండించాలని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ అన్నారు. అమ్మాయిలు ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ రక్షణ వ్యవస్థను గుర్తుచేసుకోవాలని కోరారు. దిశ యాప్ వినియోగం, అమలుపై విస్తృతంగా ఇంటింటికీ అవగాహన చేయాలని మహిళా పోలీసులకు వాసిరెడ్డి పద్మ సూచించించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement