Monday, April 29, 2024

TDP DEEKSHA: మహిళలపై అఘాయిత్యాలు..ప్రభుత్వ చర్యలేవీ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగానే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో నిత్యం మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మహిళల్లో ధైర్యం నింపేందుకే సంకల్ప దీక్ష చేపట్టామన్నారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. హోంమంత్రి సుచరిత నిస్సహాయ మంత్రి అని విమర్శించారు. విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటనలో కావాలనే వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితున్ని తమ పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్‌ చేశామని వంగలపూడి అనిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement