Thursday, May 2, 2024

నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పర్యటన

కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 11:45కు గన్నవరం విమానాశ్రయం రానున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శిస్తారు. 12:30 నుంచి 1:45 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 1:45కు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ ఫైఓవర్‌ ప్రారంభించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2గంటలకు తాడేపల్లి సీఎం నివాసానికి వెళ్తారు. 2:20 నుంచి 3:30వరకు తాడేపల్లిలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష.. సీఎం నివాసంలో విందు చేస్తారు. 3:20కు కనకదుర్గమ్మ ఆలయాలన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 5:15వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గడ్కరీకి సత్కారం జరగనుంది. సాయంత్రం 5:20 నుంచి 5:45 మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి నాగపూర్‌ పయనం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement