Tuesday, April 30, 2024

గవర్నర్‌తో కేంద్ర మంత్రి భారతీపవార్‌ భేటీ..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరి చందన్‌తో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ పవార్‌ భేటీ అయ్యారు. ఆదివారం రాజ్‌భవన్‌కు వచ్చిన మంత్రికి రాజ్‌భవన్‌ ఉప కార్యదర్శి డాక్టర్‌ సన్యాసి రావు స్వాగతం పలికారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన డాక్టర్‌ భారతి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోని సమకాలీన రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన పధకాలను గురించి కేంద్ర మంత్రి గవర్నర్‌ కు వివరించారు. రాష్ట్రంలో అయా పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి డాక్టర్‌ పవార్‌ తో పాటు- ఆమె భర్త ప్రవీణ్‌ అర్జున్‌ పవార్‌ కూడా ఉన్నారు. వీరిరువురినీ గవర్నర్‌ శాలువా, మోమొంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో రాజ్‌ భవన్‌ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement