Sunday, May 19, 2024

AP: రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు దుర్మరణం..

(ఎ.కొండూరు, ప్రభన్యూస్) : ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం-జగదల్ పూర్ జాతీయ రహదారిపై ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం స్పిన్నింగ్ మిల్లు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన ఎం.చిరంజీవి (30) అదే గ్రామానికి చెందిన ఎమ్.రవి (25) గురువారం బైక్ పై తిరువూరు వైపు నుండి మైలవరం వైపు వస్తుండగా.. విజయవాడ వైపు నుండి భద్రాచలం వైపు వెళుతున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొనడంతో చిరంజీవి అక్కడికక్కడే మృతిచెందాడు.

కొన ఊపిరితో ఉన్న రవిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ ఆర్.అంకారావు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు, అలాగే శవాలకు శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ఎస్ఐ అంకారావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement