Saturday, April 27, 2024

రెండు రోజులు.. టిటిడి బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

రేపు శ్రీ శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది సంద‌ర్భంగా బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసింది టిటిడి. ఉగాది సంద‌ర్భంగా శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు నిర్వహిస్తారు. ఆరోజు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవాన్ని తీతీదే రద్దు చేసింది. ఇవాళ, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సోమవారం, మంగళవారం విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement