Sunday, April 28, 2024

Tirumala:టీటీడీ హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు

టీటీడీకి వివిధ కానుకల ద్వారా రూ. 4.64కోట్ల హుండీ ఆదాయం స‌మ‌కూరింది. తిరుమ‌ల‌లో భక్తుల రాకతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని 64,635 మంది దర్శించుకోగా 19,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులు తమ మొక్కుల ద్వారా హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీకి రూ. 4.64 కోట్లు ఆదాయం వచ్చిందని ఆల‌య అధికారులు తెలిపారు. అలాగే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం శుక్రవారం నిర్వ‌హిస్తున్న‌ట్లు, ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా తెలుపవచ్చని అన్నారు. భక్తులు 0877-2263261 అనే నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement