Sunday, May 19, 2024

AP : స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి టీటీడీ నిర్ణయం..

స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీ చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న‌ కరుణాకర్ రెడ్డి వెల్ల‌డించారు. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మాణం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -

2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు,పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. యాత్రి సముదాయంలో లిఫ్ట్ లు ఏర్పాటుకు 1.88 కోట్లు, బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం, 14కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ, గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం బంగారు తాపడానికి ఆమోదం, ఐటీ సేవల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరీకి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మత్తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబంకు 5లక్షలు పరిహారంను ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement