Thursday, May 2, 2024

Tirumala: నేడు అయోధ్యకు టీటీడీ లడ్డూలు..

అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ లక్ష లడ్డూలను టీటీడీ అయోధ్యకు తరలించనుంది.

శ్రీరాముడికి నైవేద్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు శ్రీరాముడికి ప్రసాదంగా 25 గ్రాముల లక్ష లడ్డూలను రెడీ చేశారు. రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. 350 పెట్టెల్లో ప్యాక్ చేసిన ‘లడ్డూ’లను 350 మంది భక్తులు సిద్ధం చేశారు. ఈ లడ్డూలను ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం రోజున తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకెళ్తారు. అయోధ్యలోని భక్తులకు ఉచితంగా ఈ లడ్డూలను పంపిణీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement