Friday, May 3, 2024

TS – ఘనంగా 88వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు

విశాఖపట్నం – నవనిర్మాణం చేసే శక్తి ఆధ్యాత్మికతకు మాత్రమే ఉందని, అటువంటి మంచి సమాజం కోసం పాటుపడుతున్న ప్రజాప్రతి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అభినందనీయమైన సంస్థ అని జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ యాదగిరి శ్రీనివాస్,
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.

హెచ్.బి కాలనీ లో గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఐశ్వర్య విశ్వవిద్యాలయం లో 88వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ జెడి శ్రీనివాస్, గంట్ల శ్రీనుబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మకుమారి రమక్క చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఎంతో దోహదపడతాయన్నారు. జ్ఞానము, మానసిక సుఖశాంతలు లభించే ఆధ్యాత్మికత ఉపన్యాసాలు అందించే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 149 దేశాలకు పైగా విస్తరించి పూర్తిగా మహిళలచే నడపబడుతుందని వెల్లడించారు. విశాఖలో ముఖ్యంగా రమక్క నడిపిస్తున్న ఈ సంస్థ అనేక మందికి సన్మార్గంలో నడిపించే బోధనలు అందిస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement