Sunday, April 28, 2024

Transferred – ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై ఈసి వేటు

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురి ఐఏఎస్‌ అధికారులు పేర్లు సిఫారసు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నేటి రాత్రి ఎనిమిది గంటల లోపూ ఈ ప్రక్రియ పూర్త చేయాలంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ. డి వాసుదేవ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement