Monday, May 6, 2024

ముగ్గురు డీఎంహెచ్‌ఓల బదిలీ.. ఉత్త‌ర్వులు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్యశాఖలో ముగ్గురు డీఎంఅండ్‌హెచ్‌ఓలను బదిలీ చేస్తూ ప్రిన్సిపుల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో ఎన్‌బీసీపీ జేడీగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఆర్‌.రామనారాయణ రెడ్డిని చిత్తూరు డీఎంఅండ్‌హెచ్‌గా, అక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ యు.శ్రీహరిని తిరుపతికి బదిలీ చేశారు. ఒంగోలులో విధులు నిర్వహిస్తున్న సుమయ ఖాన్‌ గుంటూరు డీఎంఅండ్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. వారం రోజుల్లో వీరు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement