Sunday, May 5, 2024

Breaking: గన్నవరం సబ్ జైలుకు పట్టాభి తరలింపు

టీడీపీ నేత పట్టాభిను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా జడ్జి పట్టాభిని సబ్ జైలుకు పంపాలని నిర్ణయించారు. పట్టాభి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నివేదిక సమర్పించారు. పట్టాభి శరీరంపై తీవ్ర గాయాలేమీ లేవని, కేవలం చేతిపై వాపు మాత్రమే ఉందని నివేదకలో వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదక ఆధారంగా పట్టాభికి రిమాండ్ విధిస్తూ.. గన్నవరం సబ్‌జైలుకు తరలించాలని సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో కాసేపటి క్రితమే పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్‌ జైలుకు తరలించారు. అయితే పట్టాభి తమ జైలుకు వద్దని జైలర్ విన్నవించారు. శాంతిభద్రతల సమస్య రావొచ్చని వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement