Thursday, May 2, 2024

AP: తెనాలిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అయితే ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య నాగమణి మృతిచెందగా, భర్త శివశంకర్ రావు, కూతురు హారిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement