Sunday, May 5, 2024

Tour – ఢిల్లీకి జగన్ .. అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే, ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. తన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై చర్చించనున్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టు స‌మాచారం అందుతోంది. మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన నేప‌థ్యంలో ఈ భేటీపై ప‌లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఇక‌.. కాంగ్రెస్ ఏపీ చీఫ్‌ షర్మిల రాకతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తుండటం జగన్ కు ఇబ్బందికరంగా మారింద‌ని, ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement