Monday, April 29, 2024

AP : ఇవాళ కృష్ణా జిల్లాలో బాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన, మచిలీపట్నంలో రోడ్డు షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు.

- Advertisement -

నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement