Monday, April 29, 2024

TS CM: నేడు కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ‌ కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సీఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ‌ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవాళ‌ అలిప్పీ నియోజకవర్గంలో గురువారం వయనాడు నియోజకవర్గంలో సిఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలిప్పీ నియోజకవర్గం నుంచి ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తుండగా వయనాడు నియోజకవర్గం నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెండు రోజుల పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement