Friday, May 3, 2024

UPSC పరీక్షల్లో తిరుపతి యువకుడు పవన్ దత్తకు 22వ ర్యాంక్

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు పి ఎస్ సి ) సివిల్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో తిరుపతికి చెందిన పవన్ దత్త 22వ ర్యాంక్ సాధించాడు. తిరుపతిలో పవన్ దత్త ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తిచేశారు. తండ్రి వెంకటేశ్వర్లు ఎల్ఐసిలో పనిచేస్తారు. తల్లి టీచర్. రైల్వే కోడూరులో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరులో కాపురం ఉంటున్నారు..పవన్ దత్త సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ లో కొంతకాలం ఐఏఎస్ శిక్షణ తీసుకున్నారు. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో ఆల్ ఇండియాలో 22వ ర్యాంకు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement