Thursday, April 25, 2024

జియో మార్ట్ నుండి.. వెయ్యి మంది ఉద్యోగులు ఔట్

వెయ్యి మంది ఉద్యోగుల్ని తొల‌గించింది రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన ఈ-కామ‌ర్స్ ఫ్లాట్‌ఫామ్ జియో మార్ట్ . రానున్న రోజుల్లో మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించ‌నున్న‌ది. సుమారు 9900 మందిని తొల‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రిటేల్ రంగంలో పాపుల‌ర్ అయిన జియోమార్ట్ ఇక నుంచి లాభాల‌పై దృష్టి పెట్టాల‌ని భావిస్తోంది. ఉద్యోగులు రిజైన్ చేయాల‌ని కంపెనీ ఆదేశించిన‌ట్లు ఓ వార్త‌క‌థ‌నం పేర్కొంది. కార్పొరేట్ ఆఫీసుల్లో ఉన్న 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల‌ను కూడా తొల‌గిస్తున్న‌ట్లు స‌మాచారం. లాభాల ఆర్జ‌న‌పై దృష్టి పెట్టిన జియోమార్ట్ త‌న ప్ర‌ణాళిక‌ల్ని మార్చుకుంది. అయితే తమ కంపెనీకి చెందిన స‌గం సెంట‌ర్ల‌ను మూసివేందుకు జియోమార్ట్ సిద్ద‌మైంది. లోక‌ల్ స్టోర్ల‌కు ఉత్ప‌త్తుల్ని స‌ర‌ఫ‌రా చేసే సెంట‌ర్ల‌ను మూసివేయాల‌ని జియోమార్ట్ భావిస్తోంది. ఇటీవ‌ల రిల‌య‌న్స్ డిజిట‌ల్ సంస్థ .. జ‌ర్మ‌నీకి చెందిన మెట్రో ఏజీ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. 344 మిలియ‌న్ల డాల‌ర్ల ఆ డీల్ వ‌ల్ల జియోమార్ట్ ఈ మార్పులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement