Saturday, May 4, 2024

Tirumala : ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెట్లు విడుదల

తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల కోసం టీటీడీ అధికారులు వివిధ రకాల ప్రత్యేక టికెట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెట్లు ఇవాళ విడుదల కానున్నాయి.

- Advertisement -

ఇవాళ‌ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమల, తిరుపతిలో వసతికి సంబంధించి టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement