Saturday, May 4, 2024

కాకినాడ జిల్లాలో మ‌ళ్లీ క‌నిపించిన పులి.. స్థానికుల్లో భ‌యం భ‌యం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. లేట‌స్ట్‌గా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ ద‌గ్గ‌ర ఈ బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement