Sunday, April 28, 2024

Breaking: న‌దిలో స్నానానికి దిగిన ముగ్గురు యువ‌కులు మృతి

మహాశివరాత్రి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. మరోవైపు పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే పండుగ పూట పుణ్యస్నానాలు చేయడానికి నదిలో దిగిన ముగ్గురు యువ‌కులు మృతిచెందిన‌ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగారు. కొద్ది క్షణాల్లో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే న‌దిలో స్నానానికి దిగిన ముగ్గురు యువ‌కులు మృతిచెందారు. మృతిచెందిన యువ‌కులు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement