Monday, April 29, 2024

స‌ర‌దాకోసం వ‌చ్చి.. భూపతిశ్వర కోనలో ముగ్గురు విద్యార్థులు మృతి

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఉన్న భూపతిశ్వర కోన అటవీ ప్రాంతంలో నీట‌ మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) మండలంలో జ‌రిగింది. స్థానిక ఎస్సై హనుమంతప్ప తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చెన్నైకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఆహ్లాదం కోసం భూపతేశ్వ‌ర‌ జలపాతానికి వ‌చ్చారు.

- Advertisement -

వీరిలోమాధవన్, నవీన్, కార్తీక్ ప్రసాద్ నీటిలో దూకగా ఎంతసేపటికి పైకి రాకపోవడంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతోపాటు ఫైర్ ఇంజనీర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేప‌ట్టారు. కొంతసేపటికే ముగ్గురి మృత‌దేహాల‌ను బ‌య‌టికి తీశారు. స్నేహితుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement