Thursday, April 25, 2024

ఆటోను ఢీ కొన్న జనరేటర్ – ముగ్గురి దుర్మరణం

ఎపి లోని చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ శివారు గరువుపాలెం వద్ద సోమవారం ఉదయం ఆటోను జనరేటర్ ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 18 మందికి గాయాలయ్యాయి. జనరేటర్ ను తాడుతో ఆటోకు కట్టుకొని తీసుకెళుతుండగా తాడు తెగిపోవడంతో వెనుక ఉన్న జనరేటర్ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. మృతి చెందిన ముగ్గురు తో పాటుగా మరో 13 మందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం మరో ఐదుగురిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement