Tuesday, April 30, 2024

విషాదం: అనుమానాస్పదస్థితిలో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం మృతి చెందారని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ 75 ఏళ్ల అత్తయ్య ఆశ్వర్థయ్య అతని ఇద్దరు చెళ్లల్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్న ముగ్గురు అనారోగ్యం కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement