Monday, May 6, 2024

Big Breaking | చిత్తూరు జిల్లాలో ఘోరం.. వాహనం ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతి

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది.. ఇవ్వాల (బుధవారం) రాత్రి తిరుపతి– బెంగళూరు హైవేపై రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు చనిపోయినట్టు తెలుస్తోంది..

కాగా, కాయగూరల వాహనం ఢీకొట్టడంతో ఏనుగులు చనిపోయినట్టు సమాచారం అందుతోంది. జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. వాహనానికి ఉన్న క్రాష్​ బ్యారియర్స్​ తగిలి రెండు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. వేహికల్​ తాకిన ధాటికి రోడ్డు అవతల మరో గున్న ఏనుగు ఎగిరిపడ్డట్టు తెలుస్తోంది. దీంతో వాహనాన్ని వదిలి డ్రైవర్​ పరారైనట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement