Wednesday, May 1, 2024

AP | జగన్​ బర్త్​డేకు ఇదో స్పెషల్, పొలంలో ‘175 జగన్’​.. అభిమానం చాటుకున్న కారుమూరు

ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి బర్త్​ డే సందర్భంగా ఏదైనా స్పెషల్​గా ప్లాన్​ చేయాలనుకున్నాడు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్​రెడ్డి. దీంతో చండూరు మండలం వలివేరు పొలాల్లో వరికోత కోయించి తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. సీఎం జగన్​ రాబోయే ఎన్నికల్లో 175/175 సీట్లు గెలుచుకోవాలని తన ఆకాంక్ష నెరవేరాలని ఇలా తయారు చేయించి అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇక.. ఇంతకుముందు బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించాడు వెంకట్​రెడ్డి. ఆ తర్వాత సంవత్సరం జై జగనన్న అనే పదాలను వరికొత్తతో కోయించారు. తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫొటో గియించారు. ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు కారుమూరు వెంకటరెడ్డి.

సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మెరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటరెడ్డికి మంత్రి మేరుగ నాగార్జున అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement