Sunday, April 28, 2024

AP: ఈ ఎన్నిక‌లు పెత్తందార్ల‌కు, పేద‌ల‌కు మ‌ధ్య పోరు.. విజ‌య‌సాయి రెడ్డి..

నెల్లూరు- ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలు కులాల మధ్య పోరు కాదని, వర్గాల మధ్య పోరు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారం అంతా ఒక్కచోటే కేంద్రీకృతమై ఉండాలని కోరుకుంటున్న సంపన్నులకు, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న సీఎం జగన్ వంటి వారికి మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని అభివర్ణించారు.

నేడు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ… అధికారం కోసం అర్రులు చాస్తున్న పెత్తందార్లకు .. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, పేదలు వారి కలలను సాకారం చేసుకునేంతవరకు వారి చేయి విడువరాదని భావించే సీఎం జగన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం అని విజయసాయిరెడ్డి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement