Thursday, May 2, 2024

రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

చిత్తూరు జిల్లా తిరుప‌తిలో ప‌రిధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జ‌రిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని మాధవ్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 60 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి నగలు, లక్ష నగదు, రోలెక్స్ కార్టర్ రెండు విలువైన వాచ్ లు దొంగ‌లు ఎత్తుకెళ్లారు. అయితే ఇంటి య‌జ‌మాని నారాయణ స్వామి కుటుంబం మంగళవారం రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి వెళ్లి తిరిగి ఇవాళ‌ ఉదయం ఇంటికి చేరుకుంది. తలుపులు తెరిచి ఉండడంతో అలిపిరి పోలీసులకు సమాచారమందించారు. అలిపిరి పోలీసులు, క్లూస్ టీం నారాయణస్వామి ఇంటికి చేరుకుని నేరస్తుల ఆధారాలను సేక‌రిస్తున్నారు. నారాయ‌ణ స్వామి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement