Saturday, April 27, 2024

క‌ర్నూలులో దొంగ‌ల చేతివాటం.. ఇంట్లో ఎవ‌రూ లేని టైమ్‌లో..

ఎమ్మిగనూరు అర్బన్ (ప్రభ న్యూస్): క‌ర్నూలు జిల్లాలో దొంగ‌లు చేతివాటం చూపుతున్నారు. ఇంట్లో ఎవ‌రూ లేని టైమ్ చూసుకుని మొత్తం దోచుకెళ్తున్నారు. ఎమ్మిగ‌నూరు పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్ కండ‌క్టర్ ఇంట్లో ఇట్లాగే దోపిడీ చేశారు. మూడురోజుల క్రితం ఆయ‌న కుటుంబంతో స‌హా తీర్థయాత్రల‌కు వెళ్లి ఇంటికి చేరుకోగా ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి ప‌రిశీలించ‌గా విలువైన వస్తువులు మాయ‌మ‌య్యాయి. బీరువాలో ఉన్న 25 తులాల బంగారపు ఆభరణాలు కనబడకపోవ‌డంతో ఆందోళనతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్ నాయక్ స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేక‌రిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నగదు, నగల వివరాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement