Thursday, April 25, 2024

చంద్రబాబు హయాంలో చేసిన పాపాలే రైతులకు శాపం.. మంత్రి కాకాని

చంద్రబాబు హయాంలో చేసిన పాపాలే రైతులకు శాపంగా మారాయని ఏపీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి విమర్శించారు. చంద్ర బాబుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తాను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యాఖ్యలు చేస్తే.. వాటిని వక్రీకరించారని మంత్రి కాకాని మండిపడ్డారు. వరి సాగు చేస్తే ప్రభుత్వానికి కలిగే ఇబ్బంది ఏది లేదని స్పష్టం చేశారు. రైతులకు తలకు మించిన భారం కాకూడదని అలా చెప్పానని అన్నారు. లాభసాటి పంటలు సాగు చేయాలని చెబితే ఇలా వక్రీకరిస్తున్నారని.. వీటిని రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement