Wednesday, May 1, 2024

హత్యకేసును చేధించిన పోలీసులు

చిత్తూరు జిల్లా నాగలాపురం ద్వారకా నగర్ లో పోలీసులు ఓ హ‌త్య కేసును చేధించారు. గ‌త‌ నెల 23న శాంతి (32) అనే వివాహిత హ‌త్య‌కు గురైంది. భర్త సురేష్ (37), అత్త లక్ష్మీ, రాజశేఖర్ (29), సుకుమార్ ( 22) ను ఈ కేసులో నిందితులుగా పోలీసులు ప‌ట్టుకున్నారు. భార్య శాంతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం, అదనపు కట్నం తేలేదనే కారణంతో భర్త సురేష్, అతని స్నేహితులు రాజశేఖర్, సుకుమార్ లతో కలిసి అత్త లక్ష్మీ సహకారంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తి, నోకియా బేసిక్ ఫోన్, హీరోహోండా బైక్ ను నిందితుల వద్ధ నుండి స్వాధీనం చేసుకున్నారు పోలీస్ లు. నిందితులను డీఎస్పీ టీడీ య‌శ్వంత్ మీడియా ముందు హాజ‌రుప‌ర్చారు. ఈ కేసులో నిందితుల‌పై క్రైమ్ నెం.131/2021 u/s 302, 201, 498(A), Section 3&4 ,DP act ,r/w 34 IPC సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాడ్ కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement