Monday, May 6, 2024

గ్రామ స్థాయిలో టీడీపీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు..

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నగరం టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు జాలెం సుబ్బారావు అన్నారు.పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు గ్రామశాఖ సమావేశం శుక్రవారం నగరం గ్రామంలోని సూర్య గ్రూప్ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని అభివ్రుధ్ది ప‌రిచేందుకు ప్ర‌తీఓక్క‌రు కృషి చూపాల‌ని నిర్న‌యాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామ సర్పంచ్ జాలెం రమణ కుమారి, చుట్టుగుళ్ల కిషోర్ వార్డు మెంబర్లు కోళ్ల సురేష్ బాబు, మొల్లేటి శ్రీనివాస్,వానరాసి పద్మావతి, రాయుడు ఆనంద రావు ,నాయకులు కొల్లబత్తుల రమణ,రాయుడు శ్రీనివాసరావు, గుబ్బల నరసింహ శెట్టి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement