Monday, April 29, 2024

పోలీస్ స్టేషన్ నాకు అత్తారింటిలా మారింది : నారా లోకేశ్

జ‌గ‌న్ తాత రాజారెడ్డికే తాము భ‌య‌ప‌డ‌లేద‌న్న లోకేశ్‌… ఇప్పుడు జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డ‌తామా? అని టీడీపీ అగ్ర‌నేత నారా లోకేష్ అన్నారు. టీడీపీ నేత‌ల‌పై ఏపీలో వ‌రుస‌గా జ‌రుగుతున్న దాడుల‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవ‌లే మ‌ర‌ణించిన పార్టీ నేత పాటిబండ్ల న‌రేంద్ర‌నాథ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మంగ‌ళ‌గిరి, కుప్పం, తెనాలిల్లో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుకొంద‌న్న లోకేశ్… అస‌లు ఈ ప్ర‌భుత్వం ఎందుకు ఇంత‌లా భ‌య‌ప‌డుతోంద‌న్నారు. వ్యాఖ్యానించారు. ఇప్ప‌టిదాకా త‌న‌పై 15 కేసులు పెట్టార‌న్న లోకేశ్… 7 సార్లు త‌న‌ను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లార‌ని తెలిపారు. వెర‌సి గ‌తంలో ఏనాడూ పోలీస్ స్టేష‌న్ గ‌డ‌ప తొక్క‌ని త‌న‌కు ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ అత్తారింటిలా మారిపోయింద‌ని ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న త‌లంపుతోనే ముందుకు సాగుతున్నామ‌న్న ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని లోకేశ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement