Friday, May 17, 2024

KNL: బాబును రాష్ట్ర ప్రజలు నమ్మరు…. మంత్రి గుమ్మనూరు

ఆలూరు, ప్రభ న్యూస్ : చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మరని సచివాలయ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు సంఘాల గ్రామాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ పరిధిలోని 98 సచివాలయాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాలకు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. ఇప్పటివరకు 27 కోట్ల 10 లక్షలు నిధులు వెచ్చించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు లక్షల 50 వేల కోట్లు అభివృద్ధి కోసం మంజూరు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. అనంతరం రూ.10లక్షలతో నిర్మించు సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్స్ చైర్మన్ నారాయణ, మండల కన్వీనర్ మారయ్య, రాజన్న, పంచాయతీ సెక్రెటరీ బాలు, వీఆర్వో ఈరన్న, వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement