Tuesday, July 23, 2024

AP : గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన‌ ఎన్డీయే కూటమి నేతలు

ఏపీలో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా పురంధరేశ్వరి బలపర్చారు. దీంతో రాజ్‌భవన్‌కు ఎన్డీయే నేతలు వెళ్లారు.

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పురంధరేశ్వరి, నాదేండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. సభానాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement