Friday, May 17, 2024

Breaking: ప్రారంభ‌మైన కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో విభజన సమస్యల పరిష్కార సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంశాఖ సమావేశానికి 12 మందికి పైగా ఐఏఎస్‌లు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన తెలంగాణ ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామ కృష్ణారావు, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, రోడ్లు – భవనాల శాఖ నుంచి శ్రీనివాసరావు, సివిల్ సప్లయిస్ అనిల్ కుమార్, ఉన్నత విద్యా శాఖ నవీన్ మిట్టల్ సింగరేణి కాలరీస్ నుంచి శ్రీనివాసరాజు సహా పలువురు అధికారుల బృందం హాజరైంది.

సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలపై చర్చ జరగనుంది. వీటిలో ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలున్నాయి. అలాగే ఏపీ నుంచి హాజరైన వారిలో సీఎస్ సమీర్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ ఎస్.ఎస్ రావత్, రోడ్లు భవనాల సెక్రెటరీ కృష్ణబాబు, ఆదిత్యనాథ్ దాస్, విజయానంద్, ప్రవీణ్ ప్రకాష్ సహా పలువురు అధికారుల బృందం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement