Saturday, April 27, 2024

తిరుప‌తిలో భిచ్చగాడి దారుణ హత్య.. రాయితో కొట్టి చంపేసిన దుండగులు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): తిరుప‌తి జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని బస్టాప్ వద్ద ఓ భిచ్చగాడిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఇవ్వాల (బుధవారం) జరిగింది. విష‌యం తెల‌సుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని మృతుడి వద్ద ఉన్న అడ్రస్ ను పరిశీలించారు. అత‌ని వ‌ద్ద రాణి, అల్లుడు సుబ్బారావు అని ఉండడంతో వారికి ఫోన్ చేశారు.

కాగా, మృతుడి పేరు లక్ష్మణరావు (65) గా క‌నుగొన్నారు. విజయవాడకు చెందిన వ్యక్తిగా వారి బంధువుల ద్వారా సమాచారం సేక‌రించారు.. అయితే అత‌డిని కుటుంబ కలహాలతో హత్య చేశారా? లేక ఎవరైనా ఆర్థిక పరమైన ఘర్షణలు జరిగాయా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకు అతన్ని అతిధారణంగా కాశి రాయితో కొట్టి చంపారనే విష‌యంలో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. సంఘటన స్థలానికి ఎస్. వి యూనివర్సిటీ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement