Sunday, April 28, 2024

ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240లు … సీఎం జ‌గ‌న్

ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ… పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు, భూ రక్షసర్వే పూర్తికావాలన్నారు. అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వెయ్యి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలన్నారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలన్నారు. సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలన్నారు. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలన్నారు. ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలన్నారు. అదే సమయంలో ఎస్‌డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారన్నారు. ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారన్నారు. ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించామ‌న్నారు. ఈ పనులు చేపట్టేలా యద్ధ ప్రాతిపదికిన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement