Monday, April 29, 2024

Telugudesam – గెలిచే అభ్యర్ధులకే టిక్కెట్స్ ….. తేల్చి చెప్పిన చంద్రబాబు..

ప‌నితీరు బాగోలేకుంటే తోక‌లు క‌త్తిరిస్తా
ఎంత పెద్ద నాయ‌కుడికైనా గెలిచే సత్తా ఉంటే టిక్కెట్
ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా రెడీ
అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే న‌ష్ట‌పోయేది మీరే

ఒంగోలు: వచ్చే ఎన్నిక‌ల‌లో గెలిచే అభ్య‌ర్ధుల‌కే సీట్లు ఇస్తాన‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తేల్చి చెప్పారు.. వివిధ రూపాల‌లో సేక‌రించిన స‌మాచారం అధారంగా గెలుపు గుర్రాల‌పై తాను మొగ్గుచూపుతాన‌ని పేర్కొన్నారు.. ఒంగోలులో నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేద‌న్నారు. పనితీరు బాగాలేకుంటే ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతాన‌న్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాల‌ని కోరారు. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దు” అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు టిటిపి అవసరం ఎంతో ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement