Thursday, May 2, 2024

AP: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు

ఇవాళ సాయంత్రం భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో విశాఖపట్నం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు ఇవాళ ఉదయం సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మలతో సహా టీమిండియా బృందం సింహాచలం దేవాలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా క్రికెటర్లను వేదపండితులు, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. విశాఖపట్నం స్టేడియాన్ని ఈ మ్యాచ్‌ కోసం సర్వం సిద్దం చేశారు. టీమిండియాకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా ఆసీస్‌కు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement