Monday, April 29, 2024

జంగారెడ్డిగూడెం ఘ‌ట‌న‌పై నిల‌దీస్తే స‌స్పెండ్ చేశారు: టీడీపీ ఎమ్మెల్యేలు

జంగారెడ్డి గూడెంలో నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తమను సభ నుంచి సస్పెండ్‌ చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో వారు మాట్లాడుతూ… జంగారెడ్డిగూడెంలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఈ అంశంపై కనీసం సభలో చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. సభలో ముఖ్యమంత్రి అసత్యాలపై సభాహక్కుల నోటీసులు ఇచ్చినా.. స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాపై సమాధానం చెప్పలేకే తమను సస్పెన్షన్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడితే తమను సస్పెండ్‌ చేశారన్నారు. నాటుసారా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement