Thursday, April 25, 2024

కొడాలి నాని పెద్ద మగాడా?: యరపతినేని

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి వంటి వారిని వారి ఇంట్లోని ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైసీపీ నాయకుల మాదిరి తాము కూడా మాట్లాడగలమని… అయితే మా ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరని చెప్పారు.

చంద్రబాబు సెక్యూరిటీ వదిలేసి వస్తే మేమేంటో చూపిస్తామంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై యరపతినేని ఘాటు వ్యాఖ్యలుచేశారు. ‘’కొడాలి నాని ఏం చేస్తాడు? కొడాలి నాని పెద్ద మగాడా? అని ప్రశ్నించారు. జనాలు వైసీపీని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని… ఆ పార్టీకి ఘోరీ కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయినట్టున్నారు. టీడీపీ కార్యకర్తలంతా పట్టుదలగా పని చేసి వైసీపీని పెకిలిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారన్న యరపతినేని.. ఏడుగురిని చంపేశారని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement