Saturday, May 4, 2024

ఏపీ ఐటీ శాఖ దుస్థితి ఇది: లోకేష్

ఐటీ శాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు ఏపీ ఐటీ శాఖ పరిస్థితి తయారైందన్నారు. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యమన్నారు. కనీసం రివ్యూ మీటింగ్ కి హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు తమ శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీ శాఖ మంత్రి బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ బైబై జగన్ అంటున్నాయన్నారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు అని లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement