Sunday, April 28, 2024

దమ్ముంటే చర్చకి రా.. వైసీపీకి అచ్చెన్న సవాల్

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. సోమవారం ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ విశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే మెడ్‌ టెక్‌ ప్రాణాలు కాపాడిందని తెలిపారు. ఉత్తరాంధ్ర మంత్రులు సీఎం దగ్గర ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రను వైసీపీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని విమర్శించారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ ఎంపీలు విశాఖ రైల్వేజోన్‌పై ఎందుకు మాట్లాడరు అని అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు.  

ఇది కూడా చదవండిః ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం: డీజీపీకి చంద్రబాబు లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement